కర్ణాటకలో జూన్ 14 వరకు లాక్ డౌన్
ABN , First Publish Date - 2021-06-03T23:11:19+05:30 IST
కర్ణాటకలో జూన్ 14 వరకు లాక్ డౌన్
బెంగళూరు: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ను జూన్ 14 ఉదయం 6 గంటల వరకు పొడిగించినట్లు కర్ణాటక సీఎం బిఎస్ యెడియరప్ప ఈ రోజు ప్రకటించారు. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. వైరస్ కారణంగా కొత్తగా 16,387 కరోనా వైరస్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 463 మంది మరణించినట్లు కర్ణాటక ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఏప్రిల్ 27 నుంచి కర్ణాటకలో లాక్ డౌన్ అమల్లో ఉంది.