కర్ణాటకలో జూన్ 14 వరకు లాక్ డౌన్

ABN , First Publish Date - 2021-06-03T23:11:19+05:30 IST

కర్ణాటకలో జూన్ 14 వరకు లాక్ డౌన్

కర్ణాటకలో జూన్ 14 వరకు లాక్ డౌన్

బెంగళూరు: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూన్ 14 ఉదయం 6 గంటల వరకు పొడిగించినట్లు కర్ణాటక సీఎం బిఎస్ యెడియరప్ప ఈ రోజు ప్రకటించారు. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. వైరస్ కారణంగా కొత్తగా 16,387 కరోనా వైరస్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 463 మంది మరణించినట్లు కర్ణాటక ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఏప్రిల్ 27 నుంచి కర్ణాటకలో లాక్ డౌన్ అమల్లో ఉంది.

Updated Date - 2021-06-03T23:11:19+05:30 IST