రాపూరులో లాక్డౌన్
ABN , First Publish Date - 2021-08-03T23:10:06+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి రాపూరు
నెల్లూరు: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి రాపూరు పట్టణంలో ఒంటి గంట నుంచి ఉదయం 6 వరకు లాక్డౌన్ విధించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. గత నెల 19 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు రాపూరులో 63 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా నియంత్రణలోకి రావటం లేదు. పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అన్ని వర్గాల్లో ఆందోళన నెలకొంది. మొన్న కావలి, నిన్న పొదలకూరు, ప్రస్తుతం రాపూరులో పాక్షిక లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.