పలు గ్రామాలలో లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-19T05:38:18+05:30 IST

కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో మండలం లోని పలు గ్రామాలల్లో గ్రామస్థులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించుకున్నారు. లాక్‌డౌన్‌తోనే కరోనా కట్టడి చేయవచ్చని మండలంలోని ఎడ్‌బిడ్‌, చించాల, వెంకటా పూర్‌, విట్టోలి తండాలల్లో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఉదయం, సాయంత్రం వే

పలు గ్రామాలలో లాక్‌డౌన్‌

ముథోల్‌, ఏప్రిల్‌, 18: కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో మండలం లోని పలు గ్రామాలల్లో గ్రామస్థులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించుకున్నారు. లాక్‌డౌన్‌తోనే కరోనా కట్టడి చేయవచ్చని మండలంలోని ఎడ్‌బిడ్‌, చించాల, వెంకటా పూర్‌, విట్టోలి తండాలల్లో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో దుకాణాలు తెరిచి ఉంచాలని, మిగితా సమయాల్లో బంద్‌ ఉంచాలని ప్రకటించాయి. ప్రతీఒక్కరు మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, అత్యవసరం తప్ప మిగితా వేళల్లో బయటకు వెల్లకూడదని నిర్ణయించాయి. గ్రామస్థులందరూ ఈ నిర్ణయాలకు కట్టుబడి లాక్‌డౌన్‌ను స్వచ్ఛందంగా ప్రకటించుకున్నాయి. మిగితా గ్రామాలు కూడా లాక్‌డౌన్‌ చేపట్టేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-04-19T05:38:18+05:30 IST