మూడో రోజు లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-08-12T11:12:47+05:30 IST

యానాంలో మూడో రోజు మంగళవారం లాక్‌డౌన్‌ విజయవంతమైంది. మెడికల్‌ షాపులు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి.

మూడో రోజు లాక్‌డౌన్‌

యానాం, ఆగస్టు 11: యానాంలో మూడో రోజు మంగళవారం లాక్‌డౌన్‌ విజయవంతమైంది. మెడికల్‌ షాపులు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. యానాం ముఖద్వారం చెక్‌పోస్టుల వద్ద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. బుధవారం ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.  పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఎస్పీ భక్తవత్సలన్‌, సీఐ గూటం శివగణేష్‌లు పరిస్థితిని పర్యవేక్షించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదుచేసి,  అపరాధ రుసుం వసూలు చేశారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి కృష్ణారావు కోరారు. మంగళవారం పుదుచ్చేరిలో ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 276కేసులు నమోదుకాగా 172మందిలో డిశ్చార్జ్‌ అయ్యారని అన్నారు. 2,277కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. 

Updated Date - 2020-08-12T11:12:47+05:30 IST