రాయ్చూర్లో పెరుగుతున్న కరోనా.. జూలై 15 నుంచి 22 వరకూ లాక్డౌన్
ABN , First Publish Date - 2020-07-14T04:30:52+05:30 IST
కర్ణాటకలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. సోమవారం ఒక్కరోజే...
రాయ్చూర్: కర్ణాటకలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. సోమవారం ఒక్కరోజే కర్ణాటకలో 2,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జూలై 15 నుంచి 22 వరకూ రాయ్చూర్ నగరంతో పాటు, సింథనూర్ తాలూకాలో కూడా లాక్డౌన్ విధిస్తున్నట్లు రాయ్చూర్ డిప్యూటీ కమిషనర్ ఆర్ వెంకటేష్ కుమార్ ప్రకటించారు. ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు రావొద్దని కోరారు.
రాయ్చూర్ జిల్లాలో సోమవారం 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 763కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 280. జిల్లాలో ఇప్పటిదాకా 8 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.