మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్?
ABN , First Publish Date - 2021-03-03T23:39:53+05:30 IST
జిల్లాలోని మాచర్ల పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగినట్లు తెలుస్తోంది. ఓ
గుంటూరు: జిల్లాలోని మాచర్ల పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగినట్లు తెలుస్తోంది. ఓ కేసులో విచారణ నిమిత్తం శివరామకృష్ణ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పోలీసులు తీసుకొచ్చారు. అయితే పోలీసుల దెబ్బలు తట్టుకోలేక శివరామకృష్ణ పురుగుల మందు తాగాడు. వెంటనే పోలీసులు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరామకృష్ణ మృతి చెందాడు. శివరామకృష్ణ పురుగుల మందు తాగి చనిపోయాడని పోలీసులు చెప్పారు. పోలీస్ స్టేషన్లోకి పురుగుల మందు ఎలా వచ్చిందని శివరామకృష్ణ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. శివరామకృష్ణను పోలీసులే తీవ్రంగా కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు.