లోక్ అదాలత్ను వినియోగించుకోండి: జడ్జి
ABN , First Publish Date - 2021-06-24T04:53:41+05:30 IST
జాతీయ లోక్ అదాలత్ జూలై 10న జరుగుతుందని, కక్షిదారులందరూ వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీఆర్కే కృపాసాగర్ ఒక ప్రకటనలో సూచించారు.
కర్నూలు(లీగల్), జూన్ 23: జాతీయ లోక్ అదాలత్ జూలై 10న జరుగుతుందని, కక్షిదారులందరూ వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీఆర్కే కృపాసాగర్ ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని జిల్లా కోర్టులు, మున్సిఫ్ కోర్టుల ఆవరణలలో ఈ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి భౌతికంగా రాకపోయినా కక్షిదారులు దృశ్య శ్రవణ విధానాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తులిసానేజ కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవడానికి సుముఖంగా ఉంటే.. ఆయా పోలీస్ అధికారులు, తమ తమ న్యాయవాదులను సంప్రదించి కేసు రికార్డులను లోక్అదాలత్కు రెఫర్ చేయించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ జాతీయ లోక్అదాలత్లో సివిల్, క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాల కేసులు, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, చెక్బౌన్స్ కేసులు ప్రిలిటిగేషన్ కేసులను ఈ జాతీయ లోక్అదాలత్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు.