11న లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-12-07T06:22:56+05:30 IST

ఈనెల 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు.

11న లోక్‌ అదాలత్‌
జిల్లా జడ్జి పార్థసారథి

పెండింగ్‌ కేసులను పరిష్కరించుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి 


చిత్తూరు లీగల్‌, డిసెంబరు 6: ఈనెల 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోలేక పోయారన్నారు. ఇప్పటివరకు 4,180 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వీరంతా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  

Updated Date - 2021-12-07T06:22:56+05:30 IST