ఎంపీ రఘురామపై వేటు వేయండి.. స్పీకర్ను కోరిన వైసీపీ
ABN , First Publish Date - 2021-06-11T23:08:10+05:30 IST
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై లోక్సభ స్పీకరుకు వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను శుక్రవారం వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ కలిశారు.
ఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై లోక్సభ స్పీకరుకు వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను శుక్రవారం వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ కలిశారు. వైయస్ఆర్సీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్ సభ స్పీకర్కు సమర్పించామని అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్కు సంబంధించి స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ చెప్పారు.