ఎంపీ అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్‌ ఫోన్‌

ABN , First Publish Date - 2022-01-29T05:51:26+05:30 IST

ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు పార్లమెంట్‌ స్పీకర్‌ ఓంప్రకాష్‌ బిర్లా శుక్రవారం ఫోన్‌ చేశారు. ఆర్మూర్‌లో ఆయన కాన్వాయ్‌పై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎంపీ అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్‌ ఫోన్‌

పెద్దబజార్‌, జనవరి 28: ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు పార్లమెంట్‌ స్పీకర్‌ ఓంప్రకాష్‌ బిర్లా శుక్రవారం ఫోన్‌ చేశారు. ఆర్మూర్‌లో ఆయన కాన్వాయ్‌పై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనను వెంటనే ఢీల్లికి రావాలని స్పీకర్‌ కోరారు. ఎంపీ తనపై జరిగిన దాడి  వివరాలను స్పీకర్‌కు వివరించారు. స్పీకర్‌ ఆదేశాలకు అనుగుణంగా రెండు రోజుల్లో డిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ తెలిపారు.

Updated Date - 2022-01-29T05:51:26+05:30 IST