ముందు బెడ్లు కేటాయించండి: లోకేశ్
ABN , First Publish Date - 2021-05-08T09:07:16+05:30 IST
‘‘కరోనా మృతదేహా లు.. ఆ పక్కనే కొవిడ్ పేషెంట్లు.. వారిని తీసుకొచ్చిన బం ధువులు.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్ని ఈ హృ దయవిదారక దృశ్యాలు చూడండి
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా మృతదేహా లు.. ఆ పక్కనే కొవిడ్ పేషెంట్లు.. వారిని తీసుకొచ్చిన బం ధువులు.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్ని ఈ హృ దయవిదారక దృశ్యాలు చూడండి. వరండాలోనే శవాలు, నేలపైనే పేషెంట్లు. ఎవరు బతికున్నారో, ఎవరు చనిపోయారో తెలియని పరిస్థితి. మూడు రాజధానులు తర్వాత కట్టొచ్చు.. కానీ, ముందు ఒకే బెడ్పై ఉన్నవారికి మూడు బెడ్లు ఏర్పాటు చేయండి’’ అని సీఎం జగన్ని ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న దృశ్యాల వీడియోను జోడిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీవాళ్లే నమ్మలేకపోతున్నారు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.