పెండింగ్ జీతాల‌డిగితే అరెస్ట్ చేయించిన జ‌గ‌న్‌రెడ్డి...: లోకేష్

ABN , First Publish Date - 2021-08-05T00:05:26+05:30 IST

పెండింగ్ జీతాల‌డిగితే అరెస్ట్ చేయించిన జ‌గ‌న్‌రెడ్డి...: లోకేష్

పెండింగ్ జీతాల‌డిగితే అరెస్ట్ చేయించిన జ‌గ‌న్‌రెడ్డి...: లోకేష్

అమరావతి: లక్షలాది మంది అవ్వాతాత‌ల‌కు పెన్షన్లు లేవని టీడీపీ నేత నారా లోకేష్‌ మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగుల‌కు ఖాతాలో పెన్షన్‌ ప‌డ‌లేదన్నారు. ఒక‌టో తేదీ జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల‌కు ఇంకా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 108 సిబ్బందికి 3 నెల‌లుగా వేత‌నాలివ్వలేదన్నారు. ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్, పారిశుధ్య కార్మికులు త‌మ పెండింగ్ జీతాల‌డిగితే అరెస్ట్ చేయించిన జ‌గ‌న్‌రెడ్డి... సాక్షి పేపర్‌కి సీఎఫ్ఎంఎస్ నుంచి ఈ రోజు 16.87 కోట్లు విడుద‌ల చేశారని ఆరోపించారు. సాక్షి పేపర్‌కి ఇప్పటివ‌ర‌కూ 220 కోట్లు యాడ్స్ పేరుతో క‌ట్టబెట్టారని చెప్పారు. భారతి సిమెంట్‌ ధర పెంచి ఏపీ ప్రభుత్వంతో కొనుగోలు చేయించారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-08-05T00:05:26+05:30 IST