ఏపీ ప్రజల సొమ్ము సీఎం నీళ్లపాలు: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-07-10T09:28:09+05:30 IST

‘‘డబ్బులు మంచినీళ్లలా ఖర్చుచేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్లపాలు.. ఏపీ ప్రజల సొమ్ము సీఎం నీళ్లపాలు. ముఖ్యమంత్రి ఒక

ఏపీ ప్రజల సొమ్ము సీఎం నీళ్లపాలు: లోకేశ్‌

‘‘డబ్బులు మంచినీళ్లలా ఖర్చుచేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్లపాలు.. ఏపీ ప్రజల సొమ్ము సీఎం నీళ్లపాలు. ముఖ్యమంత్రి ఒక సమావేశంలో తాగిన వాటర్‌ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల ఖరీదు అక్షరాలా రూ.43.44 లక్షలు. ఒక్క రోజులో ఇంత తాగారంటే అది అమృతమైనా అయ్యుండాలి. లేదంటే కుంభకోణమైనా చేసుండాలి’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఈ మేరకు గురువారమిక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఏడాది క్రితం జరిగిన జగన్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజున వాటర్‌ బాటిళ్లు, అల్పాహారానికి రూ.59.49 లక్షలు బిల్లు అయిందట. తిన్నవి స్నాక్సా? కరెన్సీ నోట్లా?’’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-10T09:28:09+05:30 IST