అధికార బలుపుతో ప్రజలపై ఆగ్రహమా?: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-10-18T08:49:16+05:30 IST

అధికార బలుపుతో ప్రజలపై ఆగ్రహమా?: లోకేశ్‌

అధికార బలుపుతో ప్రజలపై ఆగ్రహమా?: లోకేశ్‌

‘‘వరదలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి... ‘ఏం కావాలిరా మీకు? మమ్మల్నే ప్రశ్నిస్తారా? పొండి అవతలకు’ అంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఛీత్కరించుకుని వెళ్లిపోయారు. ఆదుకొమ్మని  అడిగిన పాపానికి అధికార బలుపుతో ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ‘‘గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పర్యటించిన వైసీపీ ప్రజాప్రతినిధుల బృందానికి ప్రజల సమస్యలు వినే ఓపిక కూడా లేకపోవడం దారుణం. ప్రజలని వరదల్లో వదిలేసి ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్న ఆంధ్రా నీరో జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా మేల్కొనాలి’’ అని శనివారం లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-10-18T08:49:16+05:30 IST