LOKESH: నిరుద్యోగులకు భరోసా కల్పించాలి

ABN , First Publish Date - 2021-07-24T00:09:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. వైసీపీ

LOKESH: నిరుద్యోగులకు భరోసా కల్పించాలి

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా  లోకేష్‌ విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని ట్విట్టర్‌లో లోకేష్‌ విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని ఆదుకోమని అడగటం కూడా నేరమేనా అనా ఆయన ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెడతారు, ఎంత మందిని అరెస్ట్ చేస్తారని లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని లోకేష్‌ డిమాండ్ చేశారు. 



Updated Date - 2021-07-24T00:09:58+05:30 IST