అన్నం ముట్టని లోకేష్

ABN , First Publish Date - 2021-08-16T22:31:45+05:30 IST

ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ నారా లోకేష్ ఆందోళనకు దిగారు. అరెస్టుకు నిరసరగా ఆయన మధ్యాహ్నం భోజనాన్ని నిరాకరించారు.

అన్నం ముట్టని లోకేష్

గుంటూరు: ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళనకు దిగారు. అరెస్టుకు నిరసనగా ఆయన మధ్యాహ్నం భోజనాన్ని నిరాకరించారు. ఆయన ఏమీ తినకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. లోకేష్‌ను ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. లోకేష్‌ను విడుదల చేయాలని ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్ ముందు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడారు. రోడ్డుపై బైఠాయించి.. నిరసనకు దాగారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. అంతేకాదు టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ పోలీసులు చేశారు. టీడీపీ నేతల అరెస్టులను ఆ పార్టీ నేతలు ఖండించారు. పోలీసుల తీరును టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.


Updated Date - 2021-08-16T22:31:45+05:30 IST