సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ

ABN , First Publish Date - 2021-04-18T19:57:45+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు.

సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని కోరుతూ లేఖ రాశారు. వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమమన్నారు. టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో..విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడిని నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే ఉత్తమమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతుడటంతో పాటు మరణాల రేటు కూడా పెరుగుతోందన్నారు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, వెంటిలేటర్ల కొరత అధికంగా ఉందని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-04-18T19:57:45+05:30 IST