తడిసిన ధాన్యాన్ని కొనాలి: లోకేష్
ABN , First Publish Date - 2021-11-28T01:46:24+05:30 IST
ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే
అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ప్రభుత్వాన్ని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు లోకేష్ లేఖ రాశారు. వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో వరిపంటకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రైతులు రెండుసార్లు నాట్లు వేసి తుఫాన్లతో పంట కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. పూర్తి మొత్తం చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. నష్టపోయిన ప్రతిరైతు, కౌలు రైతుకి సాయం అందించాలని ఆ లేఖలో లోకేష్ పేర్కొన్నారు.