వేధించడమే పనిగా పెట్టుకున్నారు.. జగన్ సర్కార్‌పై లోకేశ్

ABN , First Publish Date - 2020-11-10T17:48:30+05:30 IST

కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే జగన్ సర్కార్ పనిగా పెట్టుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అడ్డంగా న‌రికేసి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు చేయ‌డం

వేధించడమే పనిగా పెట్టుకున్నారు.. జగన్ సర్కార్‌పై లోకేశ్

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని మతాల వారిని పనిగట్టుకొని వేధించడమే జగన్ సర్కార్ పనిగా పెట్టుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అడ్డంగా న‌రికేసి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు చేయ‌డం వైకాపా స‌ర్కారుకి అల‌వాటుగా మారిందన్నారు. నంద్యాల‌లో ముస్లిం మైనారిటీ అబ్దుల్ స‌లాం కుటుంబాన్ని వెంటాడి హింసించి.. సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేలా చేసి.. ఇప్పుడు ప‌రిహారం ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌రెడ్డి. ‘‘బంగారు భ‌విష్య‌త్తు గ‌ల 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ళ కుమారుడు కలందర్‌ని మీ 25 లక్షలు వెనక్కి తీసుకొస్తాయా జగన్ రెడ్డి గారూ? ఏపీలో ముస్లిం మైనారిటీల‌పై దాడుల‌కు అంతే లేకుండా పోయింది. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ గారిని మండ‌లిలోనే ఘోరంగా అవ‌మానించిన స‌ర్కారు ఇది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో త‌న కూతురిని వేధించిన వారిపై ఫిర్యాదు చేసిన తండ్రి సత్తార్ ఎస్పీ కార్యాల‌యం ఎదుటే ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డితే స్పందించే వారే లేరు. అబ్దుల్ స‌లాం గారి కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కాపాడే ప్రయత్నాలు ఆపి కఠినంగా శిక్షించాలి’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 



Updated Date - 2020-11-10T17:48:30+05:30 IST