నేడు నగరంలో లోకేష్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-03-06T06:37:39+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌ శనివారం ఒంగోలులో పర్యటించనున్నారు.

నేడు నగరంలో లోకేష్‌ పర్యటన

పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం

కొత్తపట్నం బస్టాండ్‌లో సభ 

ఒంగోలు (కార్పొరేషన్‌) మార్చి 5 : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌ శనివారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఈనెల 10న జరగనున్న మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఒంగోలు వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు త్రోవగుంటకు, 4.20కి మంగమ్మ కాలేజీ జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4.45 గంటలకు చంద్రయ్యనగర్‌, 5 గంటలకు వెంకట రమణారావు హాస్పటల్‌ రోడ్డు, 5.15 గంటలకు దిబ్బలరోడ్డు, 5.30 గంటలకు 60 అడుగుల రోడ్డులలో పర్యటిస్తారు. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థు గెలుపుకోసం ప్రచారం చేస్తారు. 6 గంటలకు టీడీపీ ఆఫీస్‌ పక్క రోడ్డు, 6.15కి నవభారత్‌థియేటర్‌ ఎదురు రోడ్డు, 6.30కు గోరంట్ల జంక్షన్‌, 7 గంటలకు గోపాలనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 7.30కి కమ్మపాలెం ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకుంటారు.  రాత్రి 8 గంటలకు కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో లోకేష్‌ పాల్గొంటారు. 



Updated Date - 2021-03-06T06:37:39+05:30 IST