ఆ ఫిర్యాదును పట్టించుకోవద్దు.. లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘరామ లేఖ

ABN , First Publish Date - 2021-06-25T21:56:10+05:30 IST

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోవద్దంటూ కోరారు.

ఆ ఫిర్యాదును పట్టించుకోవద్దు.. లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘరామ లేఖ

అమరావతి: లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోవద్దంటూ కోరారు. పార్టీ క్రమశిక్షణను ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని హితవు చెప్పడం.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని లేఖలో పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అసమ్మతి కాదన్నారు. ఈ లేఖతో పాటు గతంలో సుప్రీంకోర్టు తీర్పులను జతచేశారు. తన ప్రవర్తన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదని, పార్టీ విప్‌ను ఎన్నడూ ఉల్లంఘించలేదని లేఖలో రఘురామ తెలిపారు.

Updated Date - 2021-06-25T21:56:10+05:30 IST