ఇదే ప్రశ్నపత్రం.. చూసి రాసుకోండి!
ABN , First Publish Date - 2021-11-18T15:24:49+05:30 IST
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని..
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని గుంటూరు హిందూ కళాశాలలో బుధవారం నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్ ఆంగ్ల పరీక్షలో చిత్రం చోటుచేసుకుంది. ప్రశ్నపత్రాలు కొరత ఉందంటూ.. బోర్డుపైనే ప్రశ్నలు రాసి.. చూసి రాసుకోవాలని చెప్పడంతో విద్యార్థులు విస్మయం చెందారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు సకాలంలో అందలేదని నిర్లక్ష్యం వ్యహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్కుమార్ డిమాండ్ చేశారు.