నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.25 కోట్లు

ABN , First Publish Date - 2021-09-05T17:07:31+05:30 IST

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి

నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.25 కోట్లు

తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. కాగా.. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.25 కోట్లు వచ్చిందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 24,568 మంది భక్తులు శనివారం నాడు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 13,088 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇవాళ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మాన్వేంద్ర నాథ్ రాయ్, ఎమ్మెల్యేలు రాపాకా వరప్రసాద్, రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ బీటెక్ రవి, బస్టార్ 22వ రాజు కమల్ చంద్ర భంజ్  దియెతో పాటు పలువురు ప్రముఖులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.

Updated Date - 2021-09-05T17:07:31+05:30 IST