విద్యుదాఘాతానికి డ్రైవర్, క్లీనర్ మృతి
ABN , First Publish Date - 2022-01-24T07:04:17+05:30 IST
విద్యుదాఘాతానికి ఓ లారీడ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. కత్తిపూడి 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన కూల్డ్రింక్స్ లోడింగ్ కోసం లారీపై టార్ఫాలిన్ కప్పే క్రమంలో విద్యుత్ తీగ తగిలి ఈ ప్రమాదం జరిగింది.
- లారీ బరకం కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్.. కత్తిపూడిలో సంఘటన
శంఖవరం, జనవరి 23: విద్యుదాఘాతానికి ఓ లారీడ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. కత్తిపూడి 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన కూల్డ్రింక్స్ లోడింగ్ కోసం లారీపై టార్ఫాలిన్ కప్పే క్రమంలో విద్యుత్ తీగ తగిలి ఈ ప్రమాదం జరిగింది. ప్రత్తి పాడు సీఐ కిషోర్బాబు,అన్నవరం ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పాడ కొత్తప ల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన మేడపోతుల శివ(38), ఆకులరామ్కుమార్(35) లారీడ్రైవర్, క్లీనర్లుగా చేస్తున్నారు. వీరు శ్రీకాకు ళం జిల్లా టెక్కలికి కూల్డ్రింక్స్ లోడు తీసుకువెళ్లేందుకు ఆదివారం కత్తిపూడి గొడౌన్కి చేరుకున్నారు. లోడు వేసేందుకు టార్ఫాలిన్ సరిచేస్తుండగా పైన విద్యుత్ వైరు తగిలింది. లారీ ఇనుము బాడీ కలిగి ఉండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. దీనిపై ప్రత్తిపాడు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవపంచనామా నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.