43 మద్యం దుకాణాలకు 29న లాటరీ
ABN , First Publish Date - 2021-11-26T09:43:29+05:30 IST
తక్కువ దరఖాస్తులు వచ్చిన 43 కొత్త మద్యం దుకాణాలకు టెండర్ నోటిఫికేషన్ను ఎక్సైజ్ శాఖ గురువారం విడుదల చేసింది.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తక్కువ దరఖాస్తులు వచ్చిన 43 కొత్త మద్యం దుకాణాలకు టెండర్ నోటిఫికేషన్ను ఎక్సైజ్ శాఖ గురువారం విడుదల చేసింది. ఈ నెల 29న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనుంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జిల్లాల ఎక్సైజ్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. పాత దరఖాస్తులతో పాటు కొత్తవాటిని జతచేసి లాటరీ తీస్తారు.