14 నెలల పాపకు భయంకరమైన జబ్బు.. ప్రాణం కాపాడిన లాటరీ!

ABN , First Publish Date - 2021-02-18T06:40:47+05:30 IST

భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పాప ప్రాణాలను ఓ లాటరీ కాపాడింది. ఏదో సినిమా కథలా ఉన్న ఇది నిజం. కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన ఓ జంటకు ఒక కుమార్తె. ఆ పాపకు స్పైనల్ మస్కులర్ అట్రాఫీ(ఎస్‌ఎమ్‌ఏ) అనే జబ్బు ఉంది.

14 నెలల పాపకు భయంకరమైన జబ్బు.. ప్రాణం కాపాడిన లాటరీ!

భత్కల్: భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పాప ప్రాణాలను ఓ లాటరీ కాపాడింది. ఏదో సినిమా కథలా ఉన్న ఇది నిజం. కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన ఓ జంటకు ఒక కుమార్తె. ఆ పాపకు స్పైనల్ మస్కులర్ అట్రాఫీ(ఎస్‌ఎమ్‌ఏ) అనే జబ్బు ఉంది. దీనికి చికిత్స చేయడం చాలా కష్టం. ఆస్పత్రికి తీసుకెళ్తే 16కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. దీంతో తమ బిడ్డపై ఆశలు వదులకున్న ఆ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. అయితే వీరి వేదనను చూసి దేవుడి మనసు కూడా కరిగినట్లుంది. ఈ జంటకు ఓ లాటరీ తగిలేలా చేశాడు. ప్రముఖ డ్రగ్ తయారీ సంస్థ నోవార్టిస్.. ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రామ్‌లో ఈ జంట లక్కీ విన్నర్‌గా నిలిచింది. వీరికి ఈ లాటరీ తగలడంతో సదరు సంస్థ వీళ్ల కుమార్తె 14నెలల ఫాతిమా‌కు అవసరమైన జాల్గెస్మా థెరపీ చికిత్సను ఉచితంగా అందించింది. దీంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.

Updated Date - 2021-02-18T06:40:47+05:30 IST