జోరుగా వంతెన మరమ్మతు పనులు

ABN , First Publish Date - 2021-06-18T05:37:57+05:30 IST

ఎస్‌ఆర్‌ కంపెనీ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌ వరకు ఉన్న వంతెనపై మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి.

జోరుగా వంతెన మరమ్మతు పనులు
వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్న దృశ్యం

మల్కాపురం, జూన్‌ 17 : ఎస్‌ఆర్‌ కంపెనీ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌ వరకు ఉన్న వంతెనపై మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఈ వంతెన మరమ్మతులకు గురికావడంతో వాహనాలు రాకపోకలు సాగించేటప్పుడు వంతెన ఊగుతుండేది. అంతేకాకుండా వంతెనపై అనేక గ్యాప్‌లు కూడా ఏర్పడి ఊచలు పైకి వచ్చేశాయి. దీని వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. అయితే దీనిపై స్పందించిన పోర్టు అధికారులు, జీవీఎంసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంతెన ఒక భాగాన్ని పూర్తిగా మూసివేసి మరో భాగంలో మాత్రమే వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించి పనులు చేపడుతున్నారు. ఈ వంతెన పైనుంచి పారిశ్రామిక ప్రాంతవాసులు, గాజువాక వాసులు వెళుతుంటారు. అంతేకాకుండా కేజీహెచ్‌, కలెక్టర్‌ కార్యాలయం, జీవీఎంసీ తదితర కార్యాలయాలకు ఈ ప్రాంతవాసులు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. అందువల్ల ఈ వంతెన ప్రాధాన్యాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతు పనులను వేగంగా చేపడుతున్నారు. త్వరలోనే ఈ వంతెన పూర్తి స్థాయిలో అందు బాటులోకి రావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. 

Updated Date - 2021-06-18T05:37:57+05:30 IST