‘వాలంటైన్స్ డే’న అమరావతి గర్ల్స్ స్కూల్లో ప్రతిజ్ఞ.. వీడియో వైరల్..!

ABN , First Publish Date - 2020-02-14T21:14:01+05:30 IST

ఫిబ్రవరి 14వ తేదీ రాగానే ప్రేమికుల సందడి, పార్కుల్లో భజరంగదళ్ హడావుడి కనిపించడం సహజం.

‘వాలంటైన్స్ డే’న అమరావతి గర్ల్స్ స్కూల్లో ప్రతిజ్ఞ.. వీడియో వైరల్..!

ఫిబ్రవరి 14వ తేదీ రాగానే ప్రేమికుల సందడి, పార్కుల్లో భజరంగదళ్ హడావుడి కనిపించడం సహజం. అయితే.. మహారాష్ట్రలోని అమరావతి పరిధిలో తాజాగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ గర్ల్స్ స్కూల్‌లో బాలికలతో ఆ స్కూల్ సిబ్బందిలోని ఒకరు వాలంటైన్స్ డేన చేయించిన ప్రతిజ్ఞ వైరల్‌గా మారింది. ‘మేము ఎవరినీ ప్రేమించం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని బాలికలతో ఆ వ్యక్తి ప్రతిజ్ఞ చేయించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.


45 సెకన్ల నిడివితో కూడిన ఈ వీడియోను వినోద్ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఆ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చిత్ర వాఘ్, బీజేపీ నేత పంకజ ముండే, విద్యా శాఖ మంత్రి వర్ష గైక్వాడ్, స్థానిక ఎమ్మెల్యే ఉదయ్ సామంత్‌ ట్విట్టర్‌ ఖాతాలకు ట్యాగ్ చేశాడు. దీంతో.. ఈ ఘటనపై బీజేపీ నేత పంకజ ముండే స్పందించారు. చింతూరు ప్రాంతంలోని స్కూల్లో ఈ ఘటన జరిగిందని, ఇది హాస్యాస్పదమని.. కేవలం బాలికలు మాత్రమే ఎందుకు ప్రతిజ్ఞ చేయాలని ఆమె తన ట్వీట్‌లో ప్రశ్నించారు.

Updated Date - 2020-02-14T21:14:01+05:30 IST