HYD : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. పేరెంట్స్ దగ్గరికెళ్లిన భర్త ఇంటికి తిరిగిరాలేదని.. Video Call చేసి...!

ABN , First Publish Date - 2021-09-02T14:38:00+05:30 IST

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. నాగదేవి బ్యూటీషియన్‌గా ఇక్కడ పనిచేస్తోంది...

HYD : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. పేరెంట్స్ దగ్గరికెళ్లిన భర్త ఇంటికి తిరిగిరాలేదని.. Video Call చేసి...!

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌గూడ చైతన్య విలాస్‌ కాలనీలో జరిగింది. రాజమండ్రికి చెందిన నాగదేవి(27) హైదరాబాద్‌లో చదువుకుంటున్న సమయంలో నల్గొండ జిల్లా వాసి కొత్తపేటలో నివాసముంటున్న సాయిశివ(28)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పది నెలల క్రితం సాయిశివ నాగదేవిని వివాహం చేసుకున్నాడు. సాయిశివ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. నాగదేవి బ్యూటీషియన్‌గా ఇక్కడ పనిచేస్తోంది. రాజేంద్రగనర్‌ సర్కిల్‌ పరిధిలోని చైతన్య విలాస్‌ కాలనీ క్షేత్ర హోమ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం బెంగళూరు నుంచివచ్చిన సాయిశివ తన చెల్లెలి పెళ్లి ఉందని, చెల్లి పెళ్లయిన తర్వాత మన పెళ్లి గురించి ఇంట్లో చెబుతానని భార్యకు నచ్చచెప్పి కొత్తపేట వెళ్లాడు.


రవి వెళ్లి చూడగానే ఆమె ఇంట్లోని ప్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. దీంతో రవి ఆ విషయాన్ని ఫోన్‌లో సాయిశివకు చెప్పాడు. వెంటనే సాయిశివ చైతన్య విలాస్‌ కాలనీకి చేరుకుని రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య, ఎస్‌ఐ శ్వేత సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. నాగదేవి పెద్ద అక్క భర్త ఎ.శివకుమార్‌  తమకు ఎవరి మీద అనుమానం లేదని పోలీసులకు చెప్పాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మంగళవారం రాత్రి 9:30 గంటలకు నాగదేవి భర్త సాయిశివకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. పెళ్లి బిజీలో ఉన్నానని, రాత్రి 11:30 గంటలకల్లా వచ్చేస్తానని చెప్పాడు. అయినా ఆమె వినకుండా గొడవ పడుతుండటంతో రాజమండ్రిలో ఉండే నాగదేవి సోదరికి కాన్ఫరెన్స్‌ కాల్‌ కలిపి మాట్లాడించాడు. కొద్ది సేపటి తర్వాత నాగదేవి భర్తకు వీడియో కాల్‌ చేసి వెంటనే రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. దీంతో సాయిశివ క్షేత్ర అపార్ట్‌మెంట్‌లో తమ ఇంటి పక్కన ఉండే వారికి ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. దీంతో రవి అనే మరో వ్యక్తికి ఫోన్‌ చేసి ‘నా భార్య ఆత్మహత్య చేసుకుంటానని అంటోంది. కొంచెం వెళ్లి నచ్చచెప్పండి’ అని చెప్పాడు.

Updated Date - 2021-09-02T14:38:00+05:30 IST