ఏడాదిన్నర క్రితం పెళ్లి.. ఆర్మీలో పనిచేస్తున్న కొడుకు.. కోడలు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో ఆ అత్తమామలు కిటికీలోంచి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-26T00:22:24+05:30 IST

వారిద్దరూ ఏడాదిన్నర క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో కోడలు అత్తమామలతో కలిసే ఉంటోంది. అయితే ఎప్పటిలాగే కోడలు

ఏడాదిన్నర క్రితం పెళ్లి.. ఆర్మీలో పనిచేస్తున్న కొడుకు.. కోడలు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో ఆ అత్తమామలు కిటికీలోంచి చూస్తే..

లక్నో: వారిద్దరూ ఏడాదిన్నర క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో కోడలు అత్తమామలతో కలిసే ఉంటోంది. అయితే ఎప్పటిలాగే కోడలు రాత్రి భోజనం చేశాక తన గదిలోకి తాను వెళ్లి పడుకుంది. ఉదయం నిద్రలేచిన అత్తమామలు కోడలు నిద్రలేవకపోవడం గమనించారు. ఎంతసేపూ తలుపులు తట్టినా ఆమె తెరవలేదు. అనుమానంతో కిటికీలోంచి గదిలోకి చూసిన అత్తమామలకు షాకింగ్ సీన్ కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..


లక్నోకు చెందిన యోగేష్ సింగ్‌ ఉదయ్‌పూర్‌లో ఆర్మీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం 26 ఏళ్ల మాండవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విధి నిర్వహణలో భాగంగా యోగేష్ ఉదయ్‌పూర్‌లో ఉండగా, మాండవి అత్తమామలతో కలిసి ఉంటోంది. సమయం దొరికినప్పుడల్లా యోగేష్ భార్యకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. అయితే కొద్దిరోజుల తర్వాత భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి మాండవికి భర్త ఫోన్ చేశాడు. అపుడు వారిద్దరికి  ఏదో విషయంపై గొడవ జరిగింది. ఫోన్‌లోనే ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. కుటుంబసభ్యులు కలగజేసుకుని ఇద్దరికీ నచ్చచెప్పడంతో ఫోన్ కట్ చేశారు. 


అయితే ఈ ఘటన తర్వాత మాండవి తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఉదయం చాలాసేపైనా నిద్ర లేవకపోవడంతో గమనించిన అత్తమామలు తలుపులు తట్టారు. అయినా తీయకపోవడంతో కిటికీలోంచి గదిలోకి చూశారు. గదిలోని ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరేసుకుని మాండవి వేలాడుతూ కనిపించింది. దీంతో షాకైన వారు కాసేటికి తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. పోలీస్ అధికారి ధరంపాల్ మాట్లాడుతూ.. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-11-26T00:22:24+05:30 IST