బతికి ఉండగా ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు.. ఆత్మహత్య చేసుకున్నాక శవాలకు పెళ్లి చేశారు..!

ABN , First Publish Date - 2021-08-03T16:50:13+05:30 IST

వారిద్దరూ మేజర్లు.. ఒకే కులానికి చెందిన వాళ్లు.. ప్రేమించుకున్నారు.. కలిసి బతుకుదామనుకున్నారు..

బతికి ఉండగా ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు.. ఆత్మహత్య చేసుకున్నాక శవాలకు పెళ్లి చేశారు..!

వారిద్దరూ మేజర్లు.. ఒకే కులానికి చెందిన వాళ్లు.. ప్రేమించుకున్నారు.. కలిసి బతుకుదామనుకున్నారు.. అయితే ఇరు కుటంబాల పెద్దలూ ఆ పెళ్లికి అంగీకరించలేదు.. దీంతో వారు కలిసి చనిపోదామనుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. చనిపోయాక వారి మృతదేహాలకు పెళ్లి చేశారు బంధువులు.. మహారాష్ట్రలోని మాడే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


మాడే గ్రామానికి చెందిన ముఖేష్, నేహా కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకే కులానికి చెందిన వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలూ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ ఇద్దరూ ఆదివారం నేహా ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. అనంతరం మృతదేహాలను ఇరు కుటుంబాలకూ అందించారు. వారి చివరి కోరిక నేరవెర్చేందుకు ఇరు కుటుంబాల పెద్దలూ ముందుకు వచ్చారు. స్మశానంలో ఇద్దరి మృతదేహాలకు పెళ్లి చేశారు. ఇద్దరికీ దండలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-08-03T16:50:13+05:30 IST