ఆసీస్-ఇండియా మ్యాచ్ మధ్యలో ప్రపోజ్.. లవర్స్ ఎలా కలిశారో తెలుసా..?

ABN , First Publish Date - 2020-12-04T05:19:02+05:30 IST

ఆసీస్-భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో స్టాండ్స్‌లో ప్రపోజ్ చేసుకున్న జంట గుర్తుందా..? ఓ భారతీయ వ్యక్తి ఆసీస్ యువతికి లవ్ ప్రపోజ్ చేయడం, ఆ ప్రపోజల్‌ను ఆ యువతి ఒప్పుకోవడం అంతా జరిగిపోయింది. ఈ తంతంతా కెమెరాల్లో రికార్డు అవడంతో వారి లవ్ ప్రపోజల్ విపరీతంగా...

ఆసీస్-ఇండియా మ్యాచ్ మధ్యలో ప్రపోజ్.. లవర్స్ ఎలా కలిశారో తెలుసా..?

కాన్‌బెర్రా: ఆసీస్-భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో స్టాండ్స్‌లో ప్రపోజ్ చేసుకున్న జంట గుర్తుందా..? ఓ భారతీయ వ్యక్తి ఆసీస్ యువతికి పెళ్లి ప్రపోజ్ చేయడం, ఆ ప్రపోజల్‌ను ఆ యువతి ఒప్పుకోవడం అంతా జరిగిపోయింది. ఈ తంతంతా కెమెరాల్లో రికార్డు అవడంతో వారి లవ్ ప్రపోజల్ విపరీతంగా వైరల్ అయింది. అయితే ఈ వీడియో తరువాత వారిద్దరూ ఎవరా..? అని నెటిజన్ల సెర్చింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ జంట మళ్లీ బయటకొచ్చింది. తామ లవ్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు దీపేన్ మండాలియా. అతడి ప్రేయసి పేరు రోసిలీ విమ్‌బుష్. వీరిద్దరి ప్రేమ ఓ మెయిల్‌తో మొదలైందట. ఈ విషయాన్ని దీపేన్ స్వయంగా చెప్పాడు. 


‘మా ప్రేమకు కారణం ఓ మెయిల్. నేను 2018లో మెల్‌బోర్న్‌లోని ఓ అపార్ట్‌లోకి వచ్చాను. ఆ అపార్ట్‌మెంట్‌లోనే రొసిలీ అంతకుముందు ఉండేది. అయితే ఒకరోజు రొసిలీ పేరుమీద ఓ మెయిల్ మా ఇంటికొచ్చింది. ఆ తరువాత మరికొన్ని వచ్చాయి. దీంతో ఆమెకు విషయం చెప్పాను. తన అడ్రస్ చెప్పడంతో అక్కడకు వెళ్లి ఆమె మెయిల్స్ తిరిగిచ్చేశాను. అలా మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహమే ప్రేమగా మారింది. మ్యాచ్‌ మధ్యలో పెళ్లి ప్రపోజ్ చేయాలని ముందుగానే అనుకున్నా. అనుకున్నట్లుగానే మ్యాచ్‌లో ప్రపోజ్ చేశా. కానీ ఆమె అంగీకరించడం ఆనందంగా ఉంది’ అంటూ దీపేన్ చెప్పాడు.మ్యాచ్‌ ఫిక్సయింది...





Updated Date - 2020-12-04T05:19:02+05:30 IST