ప్రియుడు మోసం చేశాడని ట్రైన్కు ఎదురెళ్లి టెకీ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-13T02:46:06+05:30 IST
హైదరాబాద్ : నగరంలోని మేడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : నగరంలోని మేడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడు మోసం చేయడంతో శ్వేత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. సెప్టెంబర్18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘట్కేసర్ రైల్వే ట్రాక్పై శ్వేత ఆత్మహత్య చేసుకుంది. 19న మేడిపల్లి పీస్లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇవాళ లాలాపేట్లో ఉన్న శ్వేత ప్రియుడు అజయ్ను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది..!?
ప్రేమించానని కొద్దిరోజులు వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. చివరికి ప్రేమ పేరుతో వ్యక్తిగతంగా తీసుకున్న ఫొటోలను ప్రియుడు అజయ్ సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో నుంచి తీసేందుకు గాను బ్లాక్ మెయిల్ చేశాడు. శ్వేత బతిమలాడినా వినకుండా వేధింపులకు గురిచేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియుడే ఇలా వేధింపులకు పాల్పడటంతో శ్వేత తీవ్ర మనస్తాపానికి గురైంది. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడంతో పరువు పోయింది అంటూ అవమానానికి గురై అజయ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ అజయ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. ఇలా పదేపదే వేధిస్తుండటంతో శ్వేత ఆత్మహత్యకు పాల్పడింది. ట్రైన్కు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో శ్వేత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అజయ్ను పోలీసులు కఠినంగా శిక్షించాలని శ్వేత కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు కోరుతున్నారు.