ప్రేమికుల రోజున వింత.. ఇలా కలిసిపోయి..!

ABN , First Publish Date - 2021-02-16T17:17:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు, నిప్పుగా ఉండే

ప్రేమికుల రోజున వింత.. ఇలా కలిసిపోయి..!

  • ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..!


కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు, నిప్పుగా ఉండే టీడీపీ, వైసీపీ జెండాలు ఇక్కడ ఒక్కటయ్యాయి. నిన్నటివరకు కత్తులు దూసుకున్న ఇరుపార్టీల నేతలు ప్రేమికుల రోజు కలిసిపోయి ఓట్లు అభ్యర్థించారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామంలో కనిపించిన వింత ఇది. పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని గ్రామంలో టీడీపీ, వైసీపీ రెండూ తమ అభ్యర్థులను బరిలో దింపగా, వైసీపీ మండల నాయకత్వం.. ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్న ప్యానల్‌ను వ్యతిరేకించింది. మరికొందరికి మద్దతు ఇచ్చింది. నామినేషన్లు ఉపసంహరించుకున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గెలవాలని ఇలా కావాలనే ప్రచారం చేశారు. పార్టీల జెండాలను ఒకే బండికి కట్టి ప్రచారం నిర్వహించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.

Updated Date - 2021-02-16T17:17:34+05:30 IST