20 ఏళ్ల భార్య కనిపించకుండా పోయిందని కేసు పెట్టిన భర్త.. సరిగ్గా 60 రోజుల తర్వాత 26 ఏళ్ల ఓ కుర్రాడితో సహా..

ABN , First Publish Date - 2021-11-20T22:08:56+05:30 IST

కొద్ది రోజుల క్రితమే ఆ యువతికి వివాహమైంది. భర్తతో కలిసి అత్తారింట్లోనే ఉంటుంది. అయితే సడన్‌గా ఓరోజు

20 ఏళ్ల భార్య కనిపించకుండా పోయిందని కేసు పెట్టిన భర్త.. సరిగ్గా 60 రోజుల తర్వాత 26 ఏళ్ల ఓ కుర్రాడితో సహా..

భోపాల్: కొద్ది రోజుల క్రితమే ఆ యువతికి వివాహమైంది. భర్తతో కలిసి అత్తారింట్లోనే ఉంటుంది. అయితే సడన్‌గా ఓరోజు ఆ 20 ఏళ్ల భార్య కనిపించకుండా పోయింది. దీంతో భర్త పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే సరిగ్గా 60 రోజుల తర్వాత జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆ యువతి 26 ఏళ్ల కుర్రాడితో సహా ఊహించని విధంగా కనిపించడంతో అంతా షాకయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..


కంద్వా జిల్లాలోని సలాయ్ గ్రామానికి చెందిన కున్వర్ సింగ్ భిలాలకు 20 ఏళ్ల ఊర్మిళతో కొద్ది రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే సడన్‌గా ఓ రోజు ఊర్మిళ ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోవడంతో భర్త సెప్టెంబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నా ఊర్మిళ ఆచూకీ పోలీసులకు దొరకలేదు. 


అయితే శనివారం ఉదయం కిర్గావ్ గ్రామ సమీపంలోని అడవిలో చెట్టుకు వేలాడుతూ.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యువతీయువకుల మృతదేహాలను స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఉన్న దుస్తులు, చెప్పుల ఆధారంగా మహిళను ఊర్మిళగా గుర్తించారు. ఈ క్రమంలోనే యువకుడిని దుగ్వారాకు చెందిన 26 ఏళ్ల పటేల్ సింగ్‌గా గుర్తించారు. వారిద్దరి మధ్య చాలాకాలంగా సంబంధం ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అందువల్లే సెప్టెంబరులో ఇద్దరూ కలిసి ఇంట్లోనుంచి పారిపోయారని.. అయితే ఇది ఆత్మహత్యా లేక హత్యా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-11-20T22:08:56+05:30 IST