chennai: లోఓల్టేజీ సమస్యకు check
ABN , First Publish Date - 2021-10-17T13:09:28+05:30 IST
రాష్ట్రంలో లో ఓల్టేజీ, హై ఓల్టేజీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరింపజేసేందుకు విద్యుత్ బోర్డు తగు చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు. తంజావూరు జిల్లాలో విద్యు
- మంత్రి సెంథిల్ బాలాజీ
ప్యారీస్(చెన్నై): రాష్ట్రంలో లో ఓల్టేజీ, హై ఓల్టేజీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరింపజేసేందుకు విద్యుత్ బోర్డు తగు చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు. తంజావూరు జిల్లాలో విద్యుత్ బోర్డు అభివృద్ధి పనులను మంత్రి శనివారం ఉదయం పరిశీలించారు. ఆయన వల్లం సమీపంలో ఉన్న తిరుకానూర్పట్టి గ్రామంలో వ్యవసాయ భూములకు ఉచిత విద్యుత్ పథకం కింద ఏర్పాటు చేసుకున్న పంపుసెట్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వ్యవసాయ భూముల్లో తెగిపడే విద్యుత్ తీగలను ఎప్పటికప్పుడు సంబంధిత రైతులు తొలగించాలని, విద్యుదాఘాతానికి ఒక్కరు కూడా చనిపోకుండా విద్యుత్ బోర్డు అధికారులు ముందు చూపుతో వ్యవహరించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు.