ప్రతిపక్ష నేతగా ఎడప్పాడి..?
ABN , First Publish Date - 2021-05-05T12:52:02+05:30 IST
స్థానిక రాయపేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరగనున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభ పక్షనేతగా ఎడప్పాడి పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎన్ను
చెన్నై: స్థానిక రాయపేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరగనున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభ పక్షనేతగా ఎడప్పాడి పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే 65 స్థానాల్లో, కూటమి పార్టీల నేతలు మరో 10 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో, 16వ శాసనసభలో అన్నాడీఎంకే ప్రతిపక్ష స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో, శాసనసభ పక్ష నేతను ఎన్నుకొనేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం మధ్యాహ్నం 4.30 గంటలకు సమావేశం కానున్నారు. సమావేశానికి పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వం వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ సకాలంలో తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం లేఖలు రాసింది.