UAE లో లులు గ్రూప్ బంపరాఫర్.. 50 రోజుల పాటు 50 శాతం డిస్కౌంట్.. 2.5 కిలోల గోల్డ్ గెలుచుకునే ఛాన్స్!

ABN , First Publish Date - 2021-10-20T17:13:38+05:30 IST

ఎన్నారై ఎంఏ యూస‌ఫ్ అలీకి చెందిన లులు గ్రూపు యూఏఈ వ్యాప్తంగా బంపరాఫర్ ప్రకటించింది. యూఏఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా లులు హైపర్‌మార్కెట్ వివిధ ఉత్పత్తులపై 50 రోజుల పాటు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 9 వరకు 50 రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

UAE లో లులు గ్రూప్ బంపరాఫర్.. 50 రోజుల పాటు 50 శాతం డిస్కౌంట్.. 2.5 కిలోల గోల్డ్ గెలుచుకునే ఛాన్స్!

యూఏఈ: ఎన్నారై ఎంఏ యూస‌ఫ్ అలీకి చెందిన లులు గ్రూపు యూఏఈ వ్యాప్తంగా బంపరాఫర్ ప్రకటించింది. యూఏఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా లులు హైపర్‌మార్కెట్ వివిధ ఉత్పత్తులపై 50 రోజుల పాటు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 9 వరకు 50 రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 'యూఏఈ ప్రౌడ్ 50' పేరిట తీసుకొచ్చిన ఈ బంపరాఫర్ యూఏఈ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 స్టోర్స్‌లో ప్రతిరోజు 50 ప్రొడక్ట్స్‌పై 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని లులు హైపర్‌మార్కెట్ వెల్లడించింది. 


గ్రోసరీ, డిజిటల్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులకు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని లులు మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ వీ నందకుమార్ తెలిపారు. 50 రోజులకు గాను 4వేలకు పైగా ప్రొడక్ట్స్‌ను విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దుకాణదారులకు వైవిధ్యమైన కొత్త ఉత్పత్తులను అందించడానికి క్రమం తప్పకుండా కేటగిరీలు మారుతుంటాయని నందకుమార్ అన్నారు. అలాగే 100 దిర్హామ్(రూ.2,044) ఖర్చు చేసే దుకాణదారులు మొత్తం 2.5 కిలోల బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉందని తెలియజేశారు. దీనికి సంబంధించిన డ్రాను యూఏఈ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 2న నిర్వహిస్తారు. ఈ డ్రా ద్వారా యాభై మంది విజేతలు ఎంపిక చేస్తారు. వారిలో ఒక్కొక్కరికి 50 గ్రాముల బంగారం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది.


ఇక అక్టోబర్ 26 నుంచి 'డిజిటెక్' పేరిట చేపట్టే ప్రమోషన్ కార్యక్రమం ద్వారా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కెమెరాలు, ఐటీ ఉపకరణాలు, గాడ్జెట్లపై మెగా డీల్స్ ఉంటాయి. దీనిద్వారా పాత ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దుకాణదారుల వద్ద కొనుగోలుదారులకు నో కాస్ట్ ఈఏంఐ సౌకర్యం ఉంటుంది. భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపాల పండగా దీపావళి సందర్భంగా ఫ్యాషన్, స్వీట్లు, స్నాక్స్ వంటివాటి కోసం భారీ మొత్తంగా, కార్పొరేట్ ఆర్డర్‌ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. దీపావళి గిఫ్ట్ కార్డు కూడా లాంచ్ చేయనున్నారు. కాగా, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 2 వరకు 10 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపు ఉంటాయని నందకుమార్ వెల్లడించారు.

Updated Date - 2021-10-20T17:13:38+05:30 IST