కరోనాకు లుపిన్ ట్యాబ్లెట్లు.. ఒక్క ట్యాబ్లెట్ ధర..

ABN , First Publish Date - 2020-08-05T23:00:06+05:30 IST

ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కరోనా సోకిన వారికి చికిత్సలో భాగంగా...

కరోనాకు లుపిన్ ట్యాబ్లెట్లు.. ఒక్క ట్యాబ్లెట్ ధర..

న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కరోనా సోకిన వారికి చికిత్సలో భాగంగా అందిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌కు జెనరిక్ వెర్షన్‌ను ‘కోవిహాల్ట్’ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈ సంస్థ తాజాగా ప్రకటించింది. భారత్‌లో ఈ ట్యాబ్లెట్‌కు విక్రయ ధరను కూడా లుపిన్ ప్రకటించింది. ఒక్కో ట్యాబ్లెట్‌ను 49 రూపాయలకు విక్రయించనున్నట్లు తెలిపింది. 200 ఎంజీతో 10 ట్యాబ్లెట్లతో స్ట్రిప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు లుపిన్ వెల్లడించింది. ఆగస్ట్ 4న సన్ ఫార్మా కూడా ఫావిపిరవిర్ జెనరిక్ వెర్షన్‌గా ‘ఫ్లూగార్డ్’ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో ట్యాబ్లెట్ ధరను 35 రూపాయలుగా సన్ ఫార్మా ప్రకటించింది.

Updated Date - 2020-08-05T23:00:06+05:30 IST