రోజుకో మలుపు తిరుగుతున్న MAA ఎన్నికల వివాదం..

ABN , First Publish Date - 2021-10-19T12:49:14+05:30 IST

‘మా’ ఎన్నికల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.

రోజుకో మలుపు తిరుగుతున్న MAA ఎన్నికల వివాదం..

  • ‘మా’ ఎన్నికల సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన ప్రకాశ్‌రాజ్‌ బృందం
  • పోలీసుల సమక్షంలో చూపించిన ఎన్నికల అధికారి

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ‘మా’ ఎన్నికల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగాయని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ బృందం ఆరోపించింది. సీసీ ఫుటేజీని చూపించాలంటూ ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారితో పాటు జూబ్లీహిల్స్‌ పోలీసులను కోరారు. ఈ మేరకు సోమవారం ప్రకాశ్‌రాజ్‌తో పాటు మరికొంత మంది నటులు జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చేరుకున్నారు.  బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి స్కూల్‌కు వచ్చాక ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సీసీ ఫుటేజీని చూపించారు. తమపై దాడి చేసినట్టు సీసీ ఫుటేజీలో ఉన్నాయని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. ఫుటేజీ తమకు ఇవ్వాలని కోరారు. ఇందుకు ఎన్నికల అధికారి ఒప్పుకోలేదు.

Updated Date - 2021-10-19T12:49:14+05:30 IST