మచిలీపట్నం: నకలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-12-14T18:12:57+05:30 IST

మచిలీపట్నం: ఈజీ మనీ కోసం కేటుగాళ్లు ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతున్నారు.

మచిలీపట్నం: నకలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు

మచిలీపట్నం: ఈజీ మనీ కోసం కేటుగాళ్లు ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని దేనికైనా సిద్ధపడుతున్నారు. జెరాక్స్ తీసినంత సులభంగా దొంగనోట్లను ముద్రిస్తున్న ముఠా బండారం బయటపడింది. మచిలీపట్నంలో నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్ చానల్ నుంచి దొంగ నోట్లు ఎలా తయారు చేయాలో నెర్చుకున్నామని నిందితులు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. మెడికల్ షాపు యజమని ఫిర్యాదుతో ఈ ముఠా బండారం బయటపడింది. అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించిన నిందితులు దొంగనోట్లు తయారు చేసే మిషన్ కొనుగోలు చేశారు. వారు మూడు నెలల నుంచి సుమారు రూ. 5 లక్షల విలువగల 5 వందలు, వంద నోట్లు తయారు చేశారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల దొంగ నోట్లు, కలర్ ప్రింటింగ్, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-14T18:12:57+05:30 IST