ధరల పెరుగుదలకు నిరసనగా 28న ధర్నా: మధు

ABN , First Publish Date - 2021-10-26T16:36:02+05:30 IST

ధరల పెరుగుదలకు నిరసంగా ఈనెల 28న వామపక్షాలు ధర్నా చేస్తాయని సీపీఎం నేత మధు పేర్కొన్నారు.

ధరల పెరుగుదలకు నిరసనగా 28న ధర్నా: మధు

విశాఖ: నిత్యావసరధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయాయని, ధరల పెరుగుదలకు నిరసంగా ఈనెల 28న వామపక్షాలు ధర్నా చేస్తాయని సీపీఎం నేత మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రూ. 47 వేల కోట్లు ఇవ్వాల్సిన దగ్గర.. రూ. 20 వేల కోట్లే ఇస్తామని చెబుతున్నా.. సీఎం జగన్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. తెలంగాణ కంటే ఏపీ వెనుకబడిపోయిందన్నారు. ఆంధ్రాలో నీటి వనరులను కేంద్రం లాగేసుకుంటోందని, పోర్టులు, విమానాశ్రయాలు ఇలా అన్నీ ఆదానికి, రిలయన్స్‌కు కట్టబెడుతోందని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలను జగన్ ప్రభుత్వం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మధు అన్నారు.

Updated Date - 2021-10-26T16:36:02+05:30 IST