విభజన హామీలపై ఢిల్లీ పెద్దలను కేసీఆర్ ప్రశ్నించారా?: మధుయాష్కీ

ABN , First Publish Date - 2021-09-06T17:15:46+05:30 IST

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఏడేళ్లలో విభజన హామీలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారా? అని...

విభజన హామీలపై ఢిల్లీ పెద్దలను కేసీఆర్ ప్రశ్నించారా?: మధుయాష్కీ

జగిత్యాల: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఏడేళ్లలో విభజన హామీలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారా? అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ నిలదీశారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్‌లు కడతారు కానీ.. రాష్ట్రంలో పేదోళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు మాత్రం కట్టరా? అని ప్రశ్నించారు. జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత కేటాయించిన 5వేల ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలన్నారు. నదీ జలాల అంశం ప్రధాని మోదీ, అమిత్ షాలతో ఎందుకు మాట్లాడలేదన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బకరా అయ్యారని, బీజేపీలో చేరి ఆయన పొరపాటు చేశారని మధుయాష్కీ అన్నారు.

Updated Date - 2021-09-06T17:15:46+05:30 IST