గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 13 మంది మృతి!

ABN , First Publish Date - 2021-03-23T15:25:44+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...

గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 13 మంది మృతి!

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ఒక బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తంచేస్తూ, ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. 


కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతులలో 12 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. ఈ అంగన్వాడీ కార్యకర్తలంతా అంగన్వాడీలలో వంటలు వండుతుంటారు. 

Updated Date - 2021-03-23T15:25:44+05:30 IST