‘నా డెడ్బాడీని ఎవరికీ ఇవ్వొద్దు’ అని లెటర్ రాసి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-30T13:42:02+05:30 IST
నా డెడ్బాడీని ఎవరికీ ఇవ్వవద్దు
హైదరాబాద్ : మధ్యప్రదేశ్ ఇండోర్వాసి లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన భీమ్సింగ్ కుమారుడు సురేష్సింగ్(29) ఈ నెల 26న నగరానికి వచ్చి కాచిగూడ లాడ్జిలో బస చేశాడు. మంగళవారం గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్సింగ్ వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. ‘తల్లిదండ్రులు లేకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నా. దీనికి ఎవరూ బాధ్యులు కారు. నా డెడ్బాడీని ఎవరికీ ఇవ్వవద్దు’ అని సూసైడ్ నోట్లో రాసినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాచిగూడ పోలీసులు తెలిపారు.