బిల్లు కట్టలేదని తాళ్లతో కట్టేసిన ఆసుపత్రి యాజమాన్యం
ABN , First Publish Date - 2020-06-07T18:49:13+05:30 IST
తప్పు చేసినట్లు నిర్ధారణ అయిత బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి లైసన్స్ను రద్దు చేసే అవకాశముంది.
షాజాపూర్: మధ్యప్రదేశ్లో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన జరిగింది. షాజాపూర్లోని సిటీ ఆసుపత్రిలో బిల్లు కట్టలేదని 80 ఏళ్ల ముసలాయనను కట్టి పడేశారు. ఆసుపత్రిలోని బెడ్కు ఆయన కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. బాధ తట్టుకోలేక పెద్దాయన కేకలు పెడుతున్నా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కనికరం చూపించలేదట.
ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో కలెక్టర్ స్పందించారు. ఘటనపై విచారణ జరిపేందుకు బృందాన్ని పంపించారు. తప్పు చేసినట్లు నిర్ధారణ అయిత బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి లైసన్స్ను రద్దు చేసే అవకాశముంది.