కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలి

ABN , First Publish Date - 2021-10-23T05:06:47+05:30 IST

పెద్దాపురం, అక్టోబరు 22: మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘ అధ్యక్షురాలు కరక సుబ్బలక్ష్మి మాట్లాడుతూ వేతనాలు రాని కాలం నుంచి పాఠశాలలో

కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలి

పెద్దాపురం, అక్టోబరు 22: మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘ అధ్యక్షురాలు కరక సుబ్బలక్ష్మి మాట్లాడుతూ వేతనాలు రాని కాలం నుంచి పాఠశాలలో విద్యార్థులకు భోజనాలు వండిపెడుతున్నామన్నారు. తమకు రాజకీయ నాయకుల వేధింపులు అధికంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ నాయకులు దారపురెడ్డి క్రాంతికుమార్‌, సింహాచలం, మరియమ్మ, బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-23T05:06:47+05:30 IST