నీలి కవాతును విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-04-14T05:35:30+05:30 IST
నీలి కవాతును విజయవంతం చేయాలి
మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ధీరన్
వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్ 13: బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే నీలికవాతు కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పెద్దసంఖ్యలో తరలిరావాలని మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్నివర్గాల ప్రజలు, సంఘాలు సంఘటితం కావాలని కోరారు. మతఛాందసవాదంలో కూరుకుపోయిన పాలకులు దేశాన్ని కాషాయీకరణ చేయాలనే తలంపుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టే నీలికవాతుకు ప్రజలు, వివిధ సంఘాల నాయకులు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.