ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కీలక వ్యాఖ్యలు...వైఎస్సార్ లేకపోవడం వల్లే...

ABN , First Publish Date - 2020-07-13T19:40:41+05:30 IST

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ లేకపోవటం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందన్నారు.

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కీలక వ్యాఖ్యలు...వైఎస్సార్ లేకపోవడం వల్లే...

విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ లేకపోవటం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందన్నారు. సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ హయాంలో ఐదేళ్ల పాటు ఐటీ శాఖ కార్యదర్శిగా తాను పనిచేశానని చెప్పారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు కొందరు అధికారులు మూవ్ చేసిన ఫైల్స్‌పై విచారణ జరిగిందని గుర్తుచేశారు. ఇందులో తనను మాత్రం విచారించలేదని, అది తన ఇంటిగ్రీటీ అని ఆయన పేర్కొన్నారు. తన బదిలీ ప్రభుత్వ విజ్ఞతకు వదిలేస్తానని.. అనేక కారణాలతో తన బదిలీ జరిగి ఉండొచ్చన్నారు. తన బదిలీ నిర్ణయాన్ని స్వాగతిస్తానని ఆయన అన్నారు.  

Updated Date - 2020-07-13T19:40:41+05:30 IST