కరోనా నిర్మూలనకు.. మృత్యుంజయహోమం

ABN , First Publish Date - 2021-05-12T06:20:01+05:30 IST

దేశంలో కరోనా విజృంభణతో మరణాల శాతం పెరగడం వంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో కరోనా ఉధృతి తగ్గి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ స్థానిక శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో మంగళవారం ముృత్యుంజయహోమం నిర్వహించారు.

కరోనా నిర్మూలనకు.. మృత్యుంజయహోమం
యాగశాలలో ఉత్సవమూర్తులు, యజ్ఞం నిర్వహిస్తున్న అర్చకులు

మంగళగిరి, మే 11: దేశంలో కరోనా విజృంభణతో మరణాల శాతం పెరగడం వంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో కరోనా ఉధృతి తగ్గి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ స్థానిక శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో మంగళవారం ముృత్యుంజయహోమం నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ నృసింహస్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠంపజేసి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హోమం అనంతరం లోక కల్యాణార్థం శ్రీస్వామివార్లకు శాంతి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నింటిని కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏకాంతంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ఈవో మండెపూడి పానకాలరావు, ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంతపద్మనాభాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T06:20:01+05:30 IST